Monday, 4 July 2011

తెలంగాణ
తెలంగాణ వాదం ఎంత వరకు సమంజసం?  అభివృధి లో వెనకబాటు తనం అంటూ  అభివృద్ధి కొరకు పోరాటం అంటున్నారు. సీమంధ్రులు తెలంగాణను దోచుకుంటున్నారు అంటున్నారు.  మరి సామాన్య ప్రజలు దోచుకుంటున్నారు అనటంలో ఎంత నిజం వున్నది ప్రతి ప్రసంగం లో సీమంధ్రులు మా నీరు మా మన్ను  దోచుకుంటున్నారు అంటున్నారు. ఏనాడు మీరు అభివృద్ధి కొరకే పోరాడలేదు విభజన కొరకు మాత్రమే పోరాడుతున్నారు. అభివృద్ధి కీలక పాత్రగా అందించిన ప్రత్యేక  జీవోలు ప్రత్యేక ప్యాకేజీలు సరిగా అమలు కానపుడు వాటికొరకు మీరు చేసిన పోరాటాలు ఎంత ఘాటుగా ఉన్నేయో ఆత్మ విమర్శ చేసుకోండి? ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలు,  ప్రత్యేక  జీవోలు ప్రత్యేక ప్యాకేజీల ఫై  ప్రభుత్వం అలసత్వం చేసిన సందర్భాలలో చేసివుంటే.  ఈరోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కద?  ప్రస్తుతం  రాజకీయ నాయకుల హైడ్రామా లో పావులాల విద్యార్థులు మారారు. విచక్షణను మరచి రాష్ట్రమును రావణ కాష్టంగా మారుస్తన్నారు. అటు సీమాంద్ర  విద్యార్థులు కానీ ఇటు తెలంగాణ విద్యార్థులు కానీ విచక్షణతో భాద్యతాయుతంగా రాష్ట్ర అభివృద్ధి లో పలుపంచుకోవలసిన సమయం ఇది. ప్రస్తుతం మన రాష్ట్రము అభివృద్ధి పంధాలో  లో పయనిస్తున్నది దానికి విఘాతం కలగకుండా చూడవలసిన భాద్యత అందరిది.
ఈ దిశగా అందరి అడుగులు ఉంటాయని ఆశిస్తూ ....
మీ కృతి.

No comments:

Post a Comment